ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కొరోనా మహమ్మారి కమ్మేసింది. ఈ మహమ్మారికి మందు లేకపోవడంతో యావత్ ప్రపంచం ఏమీ తోచని పరిస్థితిలో ఉంది. చైనా వుహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఎక్కువ శాతం ఇటలీని ముచ్చేసింది. ఇది వారు చేసుకున్న తప్పిదం అనే చెప్పాలి. దాంతో శవాలు కాల్చడానికి కూడా కాళీ లేకుండా పోయింది. ఇక మరోపక్క ఇండియా పరిస్థితి కూడా అలా కాకూడదనే మోదీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అదే లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇదే అదును అని అనుకున్న వ్యాపారస్తులు రేట్లు పెంచేస్తున్నారు. దాంతో ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. .నిత్యావసరాలు, కూరగాయల ధర పట్టిక. ప్రభుత్వం నిర్దేశించిన కింది రేట్లకంటే అధిక ధరలకు అమ్మితే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్- 1902.
