ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను దేశమంతా గమనిస్తోంది.
sivakumar
March 26, 2020
ANDHRAPRADESH, POLITICS
4,807 Views
భారతదేశంలో ప్రస్తుతం కోరినా వైరస్ భారిన పడిన వారి సంఖ్య 600 పైగానే ఉంది. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశంమొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోపక్క ఏపీలో పనిలో చేస్తున్న తీరు పట్ల ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. “ప్రచార ఆర్భాటాలకు పోకుండా ఏపి ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను దేశమంతా గమనిస్తోంది. గ్రామ వలంటీర్ వ్యవస్థతో సిఎం జగన్ గారి దూరదృష్టిని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఇంట్లో జలుబు, జ్వరాలతో ఎంతమంది ఉన్నారో చిటికెలో చెప్పగలిగే సమాచారం ఉంది”అని అన్నారు .
Post Views: 292