ఓటుకు నోటు కేసులో టీడీపీ రాజ్యసభ అభ్యర్థి కీలక పాత్ర..! ఆధారాలతో సహా బట్టబయలు..!! అవును, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి మరో కీలక సమాచారం సోషల్ మీడియా వేదికగా బయటపడింది. ఇటీవల రాజ్యసభకు టీడీపీ నుంచి ఎంపీ సీఎం రమేష్, అలాగే, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్ ఎంపికైన విషయం తెలిసిందే.
see also : టీడీపీ రాజ్యసభ అభ్యర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాలతో సహా బట్టబయలు..!!
see also : వారం రోజులుగా ”అమరావతిలో సీబీఐ మకాం”..! కారణం తెలిస్తే షాక్..!!
అయితే, సీఎం చంద్రబాబు టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలోనూ తన కుఠిల రాజకీయ చాణ్యతను చూపించిన విషయం తెలిసిందే. మొదట మాటిచ్చిన వారికి కాకుండా.. చివరిలో తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబుకు తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఇతరులను వాడుకొని వదిలేయడం అలవాటేనని ఆ నాయకురాలు కవితే చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఓ విషయంలో మాత్రం నారా చంద్రబాబు వెనకడుగు వేయాల్సి వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎప్పుడూ ఇతరులను వాడుకొని వదిలేసే చంద్రబాబు నాయుడు కనకమేడల రవీంద్రకుమార్ ముందు తల వంచక తప్పలేదు.
see also : కర్నూల్లో జరిగే ఎమ్మెల్యే ఫంక్షన్ కు ఎన్టీఆర్
see also : ఇంట్లోకి ప్రవేశించి టీడీపీ మహిళ నేతను అతికిరాతకంగా హత్య..!
ఇక అసలు విషయానికొస్తే.. నాడు ఓటుకు నోటు కేసులో వీడియో, ఫోన్ కాల్ సాక్ష్యాలతో సహా బయటపడ్డ చంద్రబాబు అవినీతి రాజకీయాల కేసులను వాదించడానికి.. హైకోర్టు సీనియర్ న్యాయవాది అయిన కనకమేడల రవీంద్రను చంద్రబాబు వాడుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఆ విషయమే కనకమేడల రవీంద్రకుమార్కు అస్ర్తంగా మారింది. ఆ అస్ర్తమే కనకమేడల రవీంద్రకుమార్కు రాజ్యసభ సీటు కట్టబెట్టేట్టు చేసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
see also : రాయలసీమలో వైసీపీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయం..!!
రాజ్యసభ టీడీపీ మరో అభ్యర్థి సీఎం రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సంబంధించిన లక్షలకోట్ల అక్రమ ఆస్తులకు సీఎం రమేష్ బినామీ అనే విషయం సోషల్ మీడియా కోడై కూస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రమేష్కు రాజ్యసభ సీటు కేటాయించడం ఆశ్చర్యపోయే విషయమేమీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా చంద్రబాబు తన అవినీతి చిట్టా తెలిసిన కనకమేడల రవీంద్రకుమార్కు రాజ్యసభ సీటు కేటాయించడంపై టీడీపీ సీనియర్ నేతలు పెదవి విరుస్తున్నారు.