Home / ANDHRAPRADESH / జ‌గ‌న్ చెప్పిన ఆ మాట‌కు.. ముమ్మిడి వ‌రం ప్ర‌జ‌లు ఫిదా..!

జ‌గ‌న్ చెప్పిన ఆ మాట‌కు.. ముమ్మిడి వ‌రం ప్ర‌జ‌లు ఫిదా..!

ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌లో భాగంగా ల‌క్ష‌ల మంది వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ సమ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. ఎండా, చ‌లి, వాన ఇలా ఏ స‌మ‌స్య‌ను లెక్క చేయ‌కుండా జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే, వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో త‌న పాద‌యాత్ర‌ను పూర్తి చేసుకుని.. ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే, శ‌నివారం ముమ్మ‌డివ‌రంలో జ‌రిగిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర బ‌హిరంగ స‌భ‌లో వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన త‌న పాద‌యాత్ర‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాను 200 రోజులపాటు విరామం లేకుండా పాద‌యాత్ర కొన‌సాగించ‌డానికి కార‌ణం ప్ర‌జ‌లు త‌న‌పై చూపిస్తున్న అభిమానమేన‌న్నారు. ఇది విన్న ముమ్మిడివ‌రం ప్ర‌జ‌లు నైతిక‌త‌, నిబ‌ద్ధ‌త‌, చిత్త‌శుద్ధి ఉన్న వైఎస్ జ‌గ‌న‌కే త‌మ ఓటని, చంద్ర‌బాబులా మోస‌పూరిత హామీలు ఇవ్వ‌ని వైఎస్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా గెలిపించుకుంటామ‌ని ముమ్మిడివ‌రం ప్ర‌జ‌లు మీడియా వేదిక‌గా చెప్ప‌డం గ‌మ‌నార్హం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat