విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్ లీజును రద్దు చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బాక్సైట్ లీజు రద్దు ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు. సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటును కూడా గౌరవించాల్సిందే. ప్రజల విశ్వాసాలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. అందుకే బాక్సైట్ మైనింగ్ లీజు రద్దుచేస్తున్నాం అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నారావారి పుత్రరత్నం లోకేష్ వరుస ట్వీట్లు చేశారు. వైయస్ జగన్ గారూ! 2004కి ముందు చంద్రబాబుగారు, గిరిజనుల మనోభావాలకు, వారి మనుగడకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు జరపబోమని తేల్చి చెప్పారు. కానీ తరువాత అధికారంలోకి వచ్చిన మీ తండ్రిగారు ఆ నిర్ణయానికి తూట్లు పొడిచి రస్ ఆల్ ఖైమా సంస్థను బాక్సైట్ తవ్వకాలకోసం తీసుకొచ్చారు .మళ్ళీ 2014లో చంద్రబాబుగారు మీ తండ్రి బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తున్నామని నాటకం ఆడటం, దానికి సాక్షి రాతలు చూస్తుంటే, సిగ్గు కూడా సిగ్గుపడుతుంది జగన్ గారూ!..అదేదో సినిమాలో జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని కామెడీ చేసినట్లు, ఎత్తేసిన కేసులనే మళ్ళీ ఎత్తేయడం, ఇదివరకే రద్దు చేసిన వాటిని మళ్లీ మళ్ళీ రద్దు చేయడం లాంటివి కాకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నించండి. లేకపోతే ప్రజల్లో కామెడీ పీస్ లాగ మిగిలిపోతారు అంటూ లోకేష్ వరుస ట్వీట్లతో జగన్పై వ్యంగాస్రాలు విసిరారు.
బాక్సైట్ మైనింగ్ రద్దుపై సీఎం జగన్ను విమర్శిస్తూ లోకేష్ చేసిన ట్వీట్లపై నెట్జన్లతో పాటు వైసీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు. నిజమే..నువ్వన్నట్లు ఏపీఎండీసీకి విశాఖ జిల్లా చింతపల్లి, జెర్రిల్లా అటవీ బ్లాకుల్లో 3030 (1212 హెక్టార్లలో) ఎకరాల బాక్సైట్ నిక్షేపాలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. అయితే బాక్సైట్ తవ్వకాలు జరపొద్దని గిరిజనులు డిమాండు చేయడంతో అప్పట్లో విపక్ష నేతగా ఉన్న మీ బాబు చంద్రబాబు..టీడీపీ అధికారంలోకి వస్తే వీటి లీజులు రద్దుచేస్తామని ప్రకటించాడు కూడా..అయితే 2014లో అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాలతోనే గిరిజనుల ప్రగతి సాధ్యమంటూ మీ బాబు మాట మార్చిన సంగతి తెలియదా.. బాక్సైట్ తవ్వకాలకు అటవీ, పర్యావరణ తుదిదశ అనుమతులను ఆఘమేఘాలపై కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకున్నది నిజం కాదా… రాత్రికి రాత్రే 2015 నవంబరు 5న విశాఖ జిల్లాలోని చింతపల్లి, జెర్రిల్లా అటవీ ప్రాంతంలో 3030 ఎకరాల్లో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో నంబరు 97 జారీచేసింది వాస్తవం కాదా… అని నెట్జన్లు లోకేష్ను నిలదీశారు.
మన్యంలో బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజనులతో ఆందోళన చేపట్టిన సంగతి నీకు తెలియదా…చింతపల్లిలో జరిగిన బాక్సైట్ వ్యతిరేక సభలో నాటి ప్రతిపక్ష నాయకుడు బాక్సైట్ మైనింగ్ను రద్దు చేస్తామని చెప్పింది నిజం కాదా.. మీ పాలనలో బాక్సైట్ మైనింగ్కు వ్యతిరేకంగా మీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసింది నిజం కాదా…అంటూ నెట్జన్లు లోకేష్ను నిలదీశారు. .ప్రభుత్వం గిరిజనుల కోసం ఒక మంచి పని చేస్తే అభినందించేది పోయి..ఇలా దుష్ప్రచారం చేస్తారా..మీకు గిరిజనుల మీద ప్రేమ ఉంటే..జీవో నంబర్ 97 ను ఎందుకు జారీ చేశారు..గిరిజనులు పోరాడినా..ఆ జీవోను ఎందుకు రద్దు చేయలేదు అంటూ నెట్జన్లు లోకేష్పై మండిపడ్డారు. అయినా సిగ్గుమాలిన రాజకీయాలను నిస్సిగ్గుగా చేయడంలో మీ తండ్రీ కొడుకుల తర్వాతే ఎవరైనా…సిగ్గు గురించి నీ ట్వీట్స్ చూస్తుంటే మాకే సిగ్గుగా ఉంది….ఫారిన్ లో చదువుకొని ఇంత తెలివి తక్కువగా ట్వీట్లు పెడుతున్నావంటూ లోకేష్పై నెట్జన్లు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.