ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా సేవ్ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకువెళ్లడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అందరు జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు మాత్రం తన స్వార్ధం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి బొత్స అభివృద్ధి వికేంద్రీకరణ పై పూర్తి స్థాయిలో చర్చిస్తున్నామని, ఈ రోజు హై పవర్ కమిటీలో కూడా కీలక అంశాల పై చర్చ జరుగుతుంది. రాజధాని రైతుల సమస్యలు, ఉద్యోగుల పై చర్చిస్తున్నాం. ఎవరికీ అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలన్నదే మా అభిమతం అని అన్నారు. అంతేకాకుండా నిజమైన రైతుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రైతుల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం. రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలతోపాటు ఇతర ప్రతిపాదనలతో వచ్చినా.. మేలు చేసేందుకు ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉంది అని చెప్పారు.
