స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు…మా వాళ్లను నామినేషన్లు వేయకుండా వైసీపీ అరాచకం చేస్తుందంటూ..చంద్రబాబు గత రెండు రోజులుగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాడు. అయితే పుంగనూరులో కాని, మాచర్లలో కాని జరిగిన ఘటనల వెనక తొలుత టీడీపీ శ్రేణులై వైసీపీ శ్రేణులకు దాడులు చేస్తే జరిగిన ప్రతీకార దాడులు తప్పా..కావాలని జరిగినవి కాదు..ఇక క్షేత్ర స్థాయిలో జరుతుంది వేరు..టీడీపీ, జనసేన కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలు ఈ దాడులను కప్పిపెడుతూ అక్కడక్కడ వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలనే హైలెట్ చేస్తున్నాయి. తాజాగా విజయవాడలో టీడీపీ కార్యకర్తలు రెచ్చియారు. స్థానిక ఆర్వో కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు కర్రలతో వైసీసీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు నామినేషన్లు వేస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన తమపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని వారు తెలిపారు. ఈ ఘటనపై వైసీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆర్వో కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణతో విజయవాడలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది.
