చంద్రబాబు 40 సంవత్సరాల పరువును ఒక్క మాటతో తీసేసింది..!! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఏపీలో అరాచక పాలన, అవినీతి పాలన కొనసాగిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నా చరిత్ర 40 సంవత్సరాలు అంటూ సీఎం చంద్రబాబు తన అనుకూల ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ తనకు తానే డబ్బా కొట్టుకుంటున్నాడని ఎద్దేవ చేశారు. నీ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఇదా…!! అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ చంద్రబాబు పాలనపై పలు నేషనల్ మీడియా ఛానెల్స్ నిర్వహించిన సర్వేలను చూపిస్తూ ఆధారాలతో సహా చంద్రబాబును ఏకిపారేశారు.
see also : జగన్..! జైలు, చిప్పకూడు మరిచావా..?? :మంత్రి జవహర్
see also : ప్రత్యేక హోదా పోరాటంలో ఎవరు హీరో..!ఎవరు విలన్..!-బాబు సొంత సర్వే..!
1) ఏపీ రాజధాని అమరావతి దగ్గర్లో.. గుంటూరు – విజయవాడ కేంద్రాలుగా అన్ని ప్రాంతాల్లో కూడా మహిళలను వ్యభిచార కూపాలకు తరలిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. ఈ సర్వే కూడా చంద్రబాబు పాలనకు సంబంధించినదే.
2) చంద్రబాబు పాలనలో ఏపీలో విపరీతంగా క్రైమ్ రేట్ పెరిగింది. ఈ విషయాన్ని ఎన్ సీ ఆర్ బీ క్రైమ్ బ్యూరో ఇచ్చిన రిపోర్టును చూపించారు వాసిరెడ్డి పద్మ.
3) చంద్రబాబు పాలనలో పెరిగిన అవినీతి. అవినీతిలో ఏపీ నెం.1. ఇది ఎన్సీఆర్ ఇచ్చిన సర్వే.
4) అప్పుల్లో ఏపీ రైతులే టాప్.. సంక్షోభంలో రైతు.
5) రోడ్డు ప్రమాదాల్లోనూ ఏపీనే టాప్
6) పొత తాగడంలో ఆంధ్రప్రదేశ్ది 4వ స్థానం
7) చంద్రబాబు పాలనలో పెరిగిన హెచ్ఐవీ కేసులు..! చర్యలు తీసుకోవడంలో ఆరోగ్యశాఖ విఫలం..!!
8) దేశంలో ధనిక సీఎం ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే.. అంటూ ఇటీవల ఏడీఆర్, ఇండియా టుడే సంస్థలు నిర్వహించిన సర్వేను చూపించారు వాసిరెడ్డి పద్మ.
see also : 100% రాజ్యసభ కు సంతోష్ అర్హుడే..!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం మంజూరు చేసిన నిధులను పక్కదారి పట్టించి చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, అందులో భాగంగానే పోలవరంపై డాక్యుమెంటరీ తీసేందుకు ఓ నేషపనల్ ఛానెల్కు రూ.75లక్షలను చంద్రబాబు సర్కాఱ్ ఖర్చు చేసిందని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.